Tuesday, April 29, 2025

నల్లగొండలో పేలిన ఎసి…. ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: ఎసి పేలి ఇద్దరు మృతి చెందిన సంఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… నల్లగొండ జిల్లా కేంద్రంలో ఓ ఫ్రూట్స్ గోడౌన్‌లో ఎసి మిషిన్ రిపేర్ చేస్తుండగా ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో షేక్ ఖలీమ్, సాజిద్‌లు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. పేలుడు ధాటికి శరీర భాగాలు పది మీటర్ల దూరంలో పడిపోయాడు. మరో నలుగురు అక్కడి నుంచి భయంతో పరుగులు తీయడంతో ప్రాణాలు కాపాడుకున్నారు. ఎలా పేలింది అనే వివరాలు బయటకు రాలేదు.

Also Read: “కచోరీల అమ్మ”కు వందనం !

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News