Monday, April 28, 2025

కందుకూరు ఎంఆర్ఒ ఇంటిపై ఎసిబి దాడి

- Advertisement -
- Advertisement -

కందుకూరు: రంగారెడ్డి జిల్లా కందుకూరు తహశీల్దార్ మహేందర్ రెడ్డి ఇంటిపై ఎసిబి దాడులు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి వున్నాడని ఆరోపణలు రావడంతో ఎసిబి దాడులు చేసింది. ప్రస్తుతం నల్లగొండ జిల్లా మర్రిగూడ తహశీల్దార్ గా మంచిరెడ్డి మహేందర్ రెడ్డి పని చేస్తున్నారు. హస్తినపురం షిరిడి సాయి నగర్ కాలనీలోని అతడి ఇంట్లో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 2 కోట్ల రూపాయలు నగదు దొరికినట్లు సమాచారం. విలువైన డాక్యుమెంట్ల కోసం అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

Also Read: మారుతల్లితో అక్రమ సంబంధం… మొండెం నుంచి తలను వేరు చేసి…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News