24 ఏళ్ల నాటి పరువునష్టం కేసులో ప్రొబేషన్ బాండ్లు సమర్పించనందుకు సామాజిక కార్యకర్త మేధా పాట్కర్పై ఒక కోర్టునాన్ బెయిలబుల్ వారంట్ (ఎన్బిడబ్లు)ను జారీ చేసిన రెండు రోజుల తరువాత శుక్రవారం ఆమెను ఢిల్లీలో అరెస్టు చేసినట్లు అధికారులు తెలియజేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆ కేసు దాఖలు చేశారు. ఒక పోలీస్ బృందం శుక్రవారం ఉదయం ఈశాన్య ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని పాట్కర్ నివాసానికి వెళ్లి ఆమెను నిర్బంధంలోకి తీసుకున్నట్లు వారు తెలిపారు. ‘మేము ఎన్బిడబ్లును అమలు చేశాం,
మేధా పాట్కర్ను అరెస్టు చేశాం’ అని పోలీస్ డిప్యూటీ కమిషనర్ (ఈశాన్య) రవి కుమార్ సింగ్ చెప్పారు. ఆ నేరానికి అరెస్టు అవసరం లేదంటూ అదనపు సెషన్స్ జడ్జి (ఎఎస్జె) ఈ నెల 8న పాట్కర్కు ఒక ఏడాది ప్రొబేషన్ను మంజూరు చేశారు. నర్మదా బచావో ఆందోళన్ (ఎన్బిఎ) నాయకురాలిగా ఆమె చేసిన కృషిని, ఆమె పలు అవార్డుల గ్రహీత అని ఎఎస్జె ఉటంకించారు. ఆయన ఉత్తర్వు ప్రకారం, పాట్కర్ ఈ నెల 23 కల్లా ప్రొబేషన్ బాండ్లను సమర్పించవలసి ఉంది. అయితే, ఆ విధంగా ఆ బాండ్లను సమర్పించనందున కోర్టు ఆమెపై ఎన్బిడబ్లు జారీ చేసింది.