Sunday, September 8, 2024

మొదలైన ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’

- Advertisement -
- Advertisement -

'Adavallu Meeku Joharlu' movie shoot begins

హీరో శర్వానంద్ ప్రస్తుతం మూడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ కథానాయకుడు నటించిన ‘ఒకే ఒక జీవితం’ విడుదలకు సిద్ధమవుతుండగా, ‘మహాసముద్రం’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో తన పూర్తి ఫోకస్‌ను లేటెస్ట్ మూవీ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమాపై పెట్టారు శర్వానంద్. రష్మిక మందన్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తొలి చిత్రం ఇదే. టాలెంటెడ్ డైరెక్టర్ కిశోర్ తిరుమల ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

'Adavallu Meeku Joharlu' movie shoot begins

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా చిత్రీకరణ మంగళవారం నుండి మొదలైంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో శర్వానంద్, రష్మిక మందన్నతో పాటు సినిమాటోగ్రాఫర్ సుజిత్ సారంగ్‌ను చూడవచ్చు. ప్రస్తుతం శర్వానంద్, రష్మికలపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు కిషోర్ తిరుమల. ఈ సినిమాలో శర్వానంద్, రష్మిక మందన్న క్యారెక్టర్లు ఆసక్తికరంగా ఉండనున్నాయి.

‘Adavallu Meeku Joharlu’ movie shoot begins

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News