Friday, September 20, 2024

అర్ధరాత్రి గోడదూకి హాస్టల్‌లో చొరబడిన దుండగులు

- Advertisement -
- Advertisement -

సికింద్రాబాద్ ప్రభుత్వ పిజి కళాశాల మహిళల హాస్టల్ వద్ద ఆందోళనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి గోడదూకి ముగ్గురు వ్యక్తులు హాస్టల్ ప్రాంగణంలోకి చొరబడ్డారు. హాస్టల్ స్నానాల గదిలోకి చొరబడి దుండగులు సైగలు చేస్తూ యువతులను వేధించారు. సమాచారంతో అందుకున్న పోలీసులు ఒకరిని అదుపులో తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. హాస్టల్ లో తమకు సరైన రక్షణ కల్పించాలంటూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. కళాశాల గేట్లు మూసివేసి విద్యార్థినులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News