గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను హైలీ యాంటిసిపేటెడ్ ’అఖండ 2: తాండవం’ కోసం నాలుగవ సారి కలిసి పనిచేస్తున్నారు. వారి మునుపటి బ్లాక్బస్టర్ అఖండకు ఈ సీక్వెల్ యాక్షన్, ఇంటెన్స్ నెక్స్ లెవెల్ కి తీసుకెళ్లనుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. అఖండ 2: తాండవం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ప్రస్తుతం డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమా కోసం హిమాలయాల్లో రెక్కీ చేస్తున్నారు. హిమాలయాల్లోని అద్భుతమైన ప్రదేశాలలో కొన్ని ఎక్స్ ట్రార్డినరీ సన్నివేశాలను చిత్రీకరించడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఈ సన్నివేశాలు మూవీలో మెయిన్ హైలైట్ కానున్నాయి. హై బడ్జెట్తో భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సీక్వెల్లో సంయుక్త ఫీమేల్ లీడ్గా కనిపించనుంది. సంగీత సంచలనం తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అఖండ 2 పాన్ ఇండియా మూవీగా దసరా పండుగ సందర్భంగా సెప్టెంబర్ 25న థియేటర్లలోకి రానుంది.