Saturday, October 5, 2024

మంత్రి కొండా సురేఖపై మండిపడ్డ అఖిల్

- Advertisement -
- Advertisement -

హీరో అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ సమంతం విడిపోవటానికి బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆరే కారణమంటూ మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. నాగ చైతన్య, సమంత కాకుండా చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకోవడానికి కెటిఆర్ కారణమని ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఆ కామెంట్స్ ఇటు సినీ ఇండస్ట్రీలోనూ, అలూ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

ఈ నేపథ్యంలో అక్కినేని అఖిల్ మంత్రి కొండా సురేఖపై తీవ్రంగా మండిపడ్డారు. మంత్రి పదవిలో ఉన్న ఓ మహిళ మరో మహిళ గురించి ఇలాంటి ఆరోపణలు చేయడం సిగ్గు చేటని,ప్రజా సేవకురాలిగా ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఆమె ప్రవర్తించిన తీరు క్షమించరానిదన్నారు. నిరాధారమైన , హాస్యాస్పదమైన ప్రకటనలు అసభ్యకరంగా, జుగుప్సాకరంగా ఉన్నాయని అఖిల్ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News