- Advertisement -
ప్రధాని నరేంద్ర మోడీని అక్కినేని ఫ్యామిలీ మర్యాదపూర్వకంగా కలిసింది. శుక్రవారం పార్లమెంట్లో కింగ్ నాగార్జున దంపతులు, నాగ చైతన్య దంపతులతోపాటు అక్కినేని కుటుంబ సభ్యులు, మాజీ ఎంపీ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రధానిని కలిశారు.
ఈ సందర్భంగా అక్కినేని నాగేశ్వరరావు జీవిత చరిత్రను ప్రధాని చేతుల మీదుగా ఆవిష్కరించారు. ప్రస్తుతం మోడీని కలిసిన అక్కినేని ఫ్యామిలీ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా, ఇటీవల ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రధాని మోదీ ప్రస్తావించిన సంగతి తెలిసిందే.
- Advertisement -