Tuesday, September 17, 2024

ఇకపై అందరికీ స్వామివారి సర్వదర్శనానికి అనుమతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: శ్రీవారి భక్తులకు టిటిడి శుభవార్త చెప్పింది. ఇకపై స్వామివారి సర్వదర్శనానికి అందరికీ అనుమతించేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు 2 వేల నుండి 8 వేలకు పెంచుతూ టిటిడి నిర్ణయం తీసుకుంది. ఆదివారం ఉదయం నుండి భక్తులకు సర్వదర్శనం టోకెన్లను టిటిడి అందుబాటులో ఉంచింది. తిరుపతి శ్రీనివాసం వసతి సముదాయం టిక్కెట్ల కౌంటర్లు వద్ద టోకెన్లు ఇస్తున్నారు. ఆధార్ కార్డు కలిగిన ప్రతి భక్తుడికి టిటిడి ఈ అవకాశాన్ని కల్పించింది. త్వరలోనే ఆన్ లైన్ ద్వారా సర్వదర్శనం టోకెన్లను కూడా భక్తులకు అందుబాటులో ఉంచనున్నట్లు టిటిడి తెలిపింది.

All Pilgrims allowed to visit Tirumala Temple:TTD

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News