Sunday, September 8, 2024

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సర్వసన్నద్ధత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ పదో ఆవిర్భావ దినోత్సవం వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. జూన్ 2న జరిగే ఈ ఆవిర్భావ దినోత్సవంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.

గన్ పార్క్ లోని తెలంగాణ అమరవీరుల స్మారకం వద్ద ఉదయం 9.30 కు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పూలతో శ్రద్ధాంజలి ఘటించనున్నారు. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో ఉదయం 10 గంటలకు ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. రాష్ట్ర పోలీసు దళాల గౌరవ వందనాన్ని కూడా స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కూడా ఆవిష్కరించనున్నారు.

ఆ తర్వాత కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.  ఆ తర్వాత పోలీసు అధికారులకు అవార్డులు అందించనున్నారు.

సాయంత్రం ట్యాంక్ బండ్ వద్ద హ్యాండ్లూమ్, ప్రత్యేక ఉత్పత్తుల స్టాల్స్, ఫుడ్ కోర్ట్స్, తెలంగాణ వంటకాలు  సందర్శకులను ఆకట్టుకోనున్నాయి.  ట్యాంక్ బండ్ వద్ద ఉన్న స్టాల్స్ ను ముఖ్యమంత్రి సాయంత్రం 6.30కు  సందర్శించనున్నారు. తర్వాత జరిగే సాంస్కృతిక కార్యక్రమాలలో దాదాపు 700 మంది కళాకారులు పాల్గొననున్నారు.

దాదాపు 5000 మందితో ట్యాంక్ బండ్ వద్ద ఫ్లాగ్- వాక్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ‘జయ జయహే తెలంగాణ’ అనే రాష్ట్ర గీతాన్ని 13.5 నిమిషాల పాటు వినిపించనున్నారు. ఈ పాటను తెలంగాణ కవి అందెశ్రీ లిఖించారు. సంగీత దర్శకుడు కీరవాణి బాణిని సమకూర్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News