Sunday, February 23, 2025

ఆర్థిక సమస్యలు… ప్రియురాలుకు మెసేజ్ పెట్టి ప్రేమికుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆర్థిక సమస్యలతో పాటు ప్రియురాలు ప్రేమికుడిని దూరం పెట్టడంతో ఆతడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా పందిళ్లపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గాదె వంశీ కృష్ణ(22) తల్లి చనిపోవడంతో తండ్రి అతడిని వదిలి గ్రామం వదిలి వెళ్లిపోయాడు. దీంతో అమ్మమ్మ, తాతయ్య అతడిని పెంచి పోషించారు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తుండగా ఓ ప్రైవేటు సంస్థ ద్వారా లోన్ తీసుకొని కారు తీసుకున్నాడు. బకాయిలు చెల్లించాలని ప్రైవేటు సంస్థ ఒత్తిడి చేయడంతో పాటు ప్రేమించి యువతి అతడి దూరం పెట్టింది.

దీంతో ప్రియురాలు సందేశాలు పంపుతూ ఫోన్‌లో రెస్పాండ్ కావాలని కోరాడు. ఇద్దరిలో ఎవరో ఒకరు చనిపోతే ప్రశాంతంగా ఉంటుందని చెప్పడంతో “నువ్వేందుకు చనిపోవాలని నేనే చనిపోతా” అని వంశీ మెసేజ్ పెట్టి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికి వెళ్లిన మేనమామ కిరణ్ కుమార్ చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News