Thursday, July 4, 2024

స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ: ఒకరు మృతి… 15 మంది విద్యార్థులకు గాయాలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: స్కూల్ బస్సును లారీ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో క్లీనర్ దుర్మరణం చెందగా 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News