- Advertisement -
ముంబయి: ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై అన్నా హజారే స్పందించారు. అధికార దాహంతోనే మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఓడిపోయారని ధ్వజమెత్తారు. కేజ్రీవాల్పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయన్నారు. లిక్కర్ స్కామ్తో కేజ్రీవాల్ అప్రతిష్ఠపాలయ్యారని, అందుకే ఆప్ ను ప్రజలు ఓడించారరని దుయ్యబట్టారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి దూసుకుపోతోంది. ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపులో బిజెపి మ్యాజిక్ ఫిగర్ 36 దాటింది. ప్రస్తుతం బిజెపి 42 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా అధికార పార్టీ ఆప్ 28 సీట్లలో ముందంజలో ఉంది.
- Advertisement -