అమరావతి: ఏలురు వింత వ్యాధికి మరో ఇద్దరు బలయ్యారు. విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఇద్దరు బాధితులు మృతి చెందారు. ఒకరికి కరోనా వైరస్ సోకడం, మరోకరికి గుండెనొప్పి రావడంతో చనిపోయారని అధికారులు చెబుతున్నారు. ఈ అంతుచిక్కని వ్యాధితో ఇప్పటివరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఈ వింత వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 587కు చేరకుంది. వీరిలో 511మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు, వింతవ్యాధి మూలలపై వైద్య అధికారులు పరిశోధనలు చేస్తున్నారు. బ్యాటరీల రీసైక్లింగ్ లో భాగంగా సీసం నేలలో కలిసి ఉండొచ్చని.. కూరగాయలు, ధాన్యం ద్వారా కూడా శరీరంలో చేరి ఉండొచ్చని ఎయిమ్స్ వైద్యులు అనుమానిస్తున్నారు. సీసంతోపాటు ఆర్గాన్ క్లోరిన్ ప్రభావంపై నిర్ధారణ జరిగితే పూర్తి స్పష్టత వస్తుందని అభిప్రాయపడుతున్నారు.
Another two died due to Mysterious disease in Eluru