Sunday, September 8, 2024

ఐఫోన్ల రేట్లు తగ్గించిన యాపిల్ సంస్థ

- Advertisement -
- Advertisement -

బడ్జెట్‌లో మొబైల్ ఫోన్లపై కస్టమ్స్ సుంకం తగ్గింపు నేపథ్యం
స్వల్పంగా ధరలు తగ్గిన పలు మోడల్ ఐఫోన్లు
ఐఫోన్ 16 ప్రొ, 16 ప్రొ మాక్స్ మోడల్ ఫోన్లపై గణనీయంగా తగ్గింపు
న్యూఢిల్లీ : మొబైల్ ఫోన్లు, మొబైల్ పరికరాలు, మొబైల్ చార్జర్లపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తూ ఇటీవల కేంద్ర బడ్జెట్ 2024-25లో ప్రకటన వెలువడిన నేపథ్యంలో భారత్‌లో ఐఫోన్ల ధరలు తగ్గాయి. భారత్‌లో పలు మోడళ్ల ఐఫోన్ల రేట్లను తగ్గిస్తున్నట్లు యాపిల్ సంస్థ ప్రకటించింది. ఐఫోన్ 15, ఐఫోన్ 14తో పాటు పలు పాప్యులర్ మోడల్ ఫోన్ ధరలను రూ. 300 నుంచి రూ. 6000 వరకు తగ్గిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.

తగ్గింపు ధరలు ఇవే
ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ రెండు మోడల్ ఫోన్ల ధర రూ. 300 మేర తగ్గింది. 120జిబి స్టోరేజి వేరియంట్లు అయిన ఐఫోన్ ప్రస్తుత ధర రూ. 79600, ఐఫోన్ 15 ప్లస్ ధర రూ. 89600గా ఉన్నాయి. ఐఫోన్ 14 మోడల్‌పై కూడా రూ. 300 తగ్గిందని, ఈ స్టాండర్డ్ మోడల్ ధర ప్రస్తుతం రూ. 69 వేలుగా ఉందని యాపిల్ వెల్లడించింది. భారత్‌లో అత్యంత తక్కువ ధర పలికే నాన్ ఎస్‌ఇ యాపిల్ ఫోన్ అయిన ఐఫోన్ 13 మోడల్ ధర రూ. 59900 నుంచి ప్రస్తుతం రూ. 59600కు తగ్గింది. తగ్గింపు రూ. 300 మేరకు ఉంది. ఇక ఐఫోన్ ఎస్‌ఇ (2022) మోడల్ ధర అత్యధికంగా రూ. 2300 మేర తగ్గి రూ. 47600కు దిగి వచ్చింది.

ఐఫోన్ 15 ప్రొ మోడల్‌పై భారీగా తగ్గింపు
ఐఫోన్ 15 ప్రొ మోడల్ ఫోన్ ధరలు గణనీయంగా తగ్గాయి. ఐఫోన్ 15 ప్రొ 128 జిబి వెర్షన్ ధర రూ. 5100 మేర తగ్గి రూ. 134900 నుంచి రూ. 129800కు పడిపోయింది. ఇక ఐఫోన్ 15 ప్రొ మ్యాక్స్ ధర రూ. 5900 మేర తగ్గి రూ. 159900 నుంచి రూ. 154000 స్థాయికి చేరింది. భారత్‌లో తయారైన ఐఫోన్ 16 ప్రొ, 16 ప్రొ మ్యాక్స్ మోడల్ ఫోన్లను యాపిల్ సంస్థ త్వరలోనే విడుదల చేయబోతున్నది. ఫాక్స్‌కాన్ సంస్థ భాగస్వామ్యంతో తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఈ ఫోన్లు తయారవుతున్నాయి. ఒకటి రెండు నెలల్లోనే ఈ ఫోన్లు మార్కెట్‌లో అందుబాటులోకి రానున్నాయని సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News