Sunday, April 27, 2025

అరసం రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రెండ్రోజుల పాటు జరిగిన తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) రాష్ట్ర మూడవ మహాసభ చివరి రోజున నూతన రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నది. తెలంగాణ అరసం గౌరవ అధ్యక్షులుగా ఆర్.వి.రామారావు, అధ్యక్షులుగా పల్లేరు వీరస్వామి, అధ్యక్షవర్గంగా ఏటుకూరి ప్రసాద్, ఎస్వీ సత్యనారాయణ, కందిమళ్ల ప్రతాప్ వేల్పుల నారాయణ, వి.వీరాచారి, కాలువ మల్లయ్య, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ రాపోలు సుదర్శన్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా నిధి, బొమ్మగాని నాగభూషణం, బండారు సుజాత శేఖర్, చందనాల సుమిత్ర, గులాబీల మల్లారెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శిగా కెవిఎల్, కార్యదర్శులుగా కమలారెడ్డి, పలేశ్వరం వెంకటేశ్, మద్దిలేటి, కోశాధికారిగా తిరుపాల్ ప్రతినిధులు ఎన్నుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News