Saturday, October 26, 2024

కశ్మీరులో సైనిక వాహనానికి ప్రమాదం..జవాను మృతి

- Advertisement -
- Advertisement -

జమ్మూ కశ్మీరులోని కుల్గామ్ జిల్లాలో ఒక సైనిక వాహనం అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో ఒక సైనికుడు మరరణించగా 9 మంది సైనిక సిబ్బందితో సహా 13 మంది గాయపడ్డారు. శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిలో నలుగురు పౌరులు కూడా ఉన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందచేస్తున్నారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని శనివారం అధికారులు తెలిపారు. విధి నిర్వహణలో భాగంగా వెళుతున్న సైనిక వాహనం డిహెచ్ పొరా ప్రాంతంలో అదుపు తప్పి బోల్తా పడినట్లు వారు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News