Saturday, October 19, 2024

ధూంధాంగా దశాబ్ది వేడుకలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ అవతరణ వేడుకలకు ట్యాంక్ బం డ్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ట్యాంక్ బండ్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలతో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 2వ తేదీన సాయంత్రం ట్యాంక్ బండ్‌పై పండుగ వాతవరణాన్ని తలపించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ట్యాంక్ బండ్ పరిసరాలను రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించనున్నారు. సిఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, ప్రజా ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో ప్ర త్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అవతరణ వేడుకలలో సామాన్య ప్రజలు కూడా ఉ త్సాహంగా తమ కుటుంబ సభ్యులతో

కలిసి పాల్గొని ఆనందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సందర్శకులను ఆకట్టుకునే ప్రదర్శనలు, ఆట వస్తువులు, ఫుడ్ స్టాల్స్ ఏర్పాటుపై అధికారులు ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నా రు.రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన పలు సాంస్కృతిక కళా బృందాలచే కార్నివాల్ ప్రదర్శనలు జరిపేందుకు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన వేదికపై పలు శాస్త్రీయ, జానపద, దక్కనీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం ‘జయ జయహే తెలంగాణ’పై పోలీసు సిబ్బందితో ప్రదర్శన నిర్వహించనున్నారు. బాణాసంచాలు పేలుస్తూ ఉత్సవ వాతవరణాన్ని అణుభూతి పొందేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ట్యాంక్ బండ్‌పై దాదాపు 80 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో రాష్ట్రంలోని హస్త కళలలు, స్వయం సహాయక బృందాలు తయారు చేసే వస్తువులు, చేనేత ఉత్పత్తులు, నగరం లోని పలు ప్రముఖ హోటళ్ళచే ఫుడ్ కోర్టులు ఉండనున్నాయి.

ట్యాంక్ బండ్ ఏర్పాట్లను సమీక్షించిన ఉన్నతాధికారులు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లను బుధవారం సాయంత్రం పలు విభాగాల ఉన్నతాధికారులు ట్యాంక్ బండ్ వేదిక వద్ద పరిశీలించారు. వేదిక అలంకరణ, వేడుకలకు హాజరయ్యే అతిధులకు, పాల్గొనే ప్రజలకు సీటింగ్, బ్యారికేడింగ్, పార్కింగ్, త్రాగు నీటి సరఫరా, విద్యుత్ సరఫరా, పోలీస్ బందోబస్తూ తదితర ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని క్షేత్ర స్థాయి అధికారులను ఆదేశించారు. సభా ప్రాంగణంలో ప్రత్యేక మెడికల్ క్యాంపులు,మొబైల్ టాయిలెట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఎల్‌ఇడి స్క్రీన్‌లతో, కార్యక్రమ లైవ్ ప్రసారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, హైదరాబాద్ వాటర్ వర్క్ ఎండి సుదర్శన్ రెడ్డి, జి.హెచ్.యం.సి కమిషనర్ రోనాల్డ్ రాస్, పంచాయత్ రాజ్ శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్, హెచ్‌ఎండిఎ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ ఆమ్రపాలి, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ డి.జి శివధర్ రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, వివిధ శాఖల అధికారులు ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాట్లను సమీక్షించారు.

పరేడ్ గ్రౌండ్‌లో ముమ్మరంగా ఏర్పాట్లు
తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. . ముఖ్యమంత్రి తోపాటు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు హాజరయ్యే ఈ ఆవిర్భావ వేడుకల నిర్వహణకు సికిందరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో వివిధ శాఖలు పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేపట్టాయి. ఉదయం ముఖ్యమంత్రి గన్-పార్క్ లో అమరవీరుల స్థూపానికి పూల మాలలు సమర్పించి నివాళులు అర్పించిన అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో పలు కార్యక్రమాలలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే దాదాపు ఇరవై వేలమంది పట్టె భారీ షామియానాలు ఏర్పాటు చేస్తున్నారు. వేసవి ఉండడంతో హాజరయ్యే ప్రజలకు, ప్రముఖులకు ఏమాత్రం ఇబ్బందులు లేకుండా ఉండేందుకు తగు జాగ్రత చర్యలు చేపడుతున్నారు. సభా ప్రాంగణంలో ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. తాగునీటి సౌకర్యం, తగు టాయిలెట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఎల్‌ఈడి స్క్రీన్ లు, కార్యక్రమ లైవ్ ప్రసారానికి ఏర్పాట్లు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News