Sunday, October 6, 2024

ఆత్మహత్యాయత్నం చేసిన ఎస్‌ఐ మృతి

- Advertisement -
- Advertisement -

అశ్వారావుపేట ఎస్‌ఐ శ్రీను
విషాదాంతం వేధింపులకు
పాల్పడిన సిఐ జితేందర్‌రెడ్డి,
మరో నలుగురు కానిస్టేబుళ్లపై
ఎస్‌సి, ఎస్‌టి కేసు నమోదు
శ్రీను మరణ వార్త విని మేనత్త మృతి

మనతెలంగాణ/హైదరాబాద్/నల్లబెల్లి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అశ్వారావుపేట ఎస్‌ఐ శ్రీరాము ల శ్రీను ఆత్మహత్యాయత్నం ఘటన విషాదాంతమైంది. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. సిఐ జితేందర్ రెడ్డి సహా నలుగురు కానిస్టేబుల్స్ పనిలో సహకరించకపోవడమే కాకుండా కులం పేరుతో వేధించారని ఆత్మహత్యాయ త్నం అనంతరం ఎస్‌ఐ శ్రీను ఓ వీడియోలో తన గోడు వెళ్లబోసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు మృతుడి భార్య ఇచ్చిన ఫి ర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

గత నెల 30న స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్లిన ఎస్‌ఐ శ్రీను ఎంతకు తిరిగి రాకపోయే సరికి అశ్వారావుపేట పోలీసులు గాలింపు చేపట్టారు. ఈలోగా ఆయనే 108కు ఫో న్ చేసి తాను మహబూబాబాద్‌లో పురుగుల మందు తా గి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆయన చెప్పా రు. ఆ ప్రాంతానికి వెళ్లిన అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన ఆయనను హైదరాబాద్ తరలించారు. ఓ ప్రైవే టు ఆసుపత్రిలో చికిత్స అందించిన ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున ఎస్‌ఐ శ్రీను చనిపోయారు.

ఈ ఘటనపై ఇప్పటి కే పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఎస్‌ఐ శ్రీను ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అశ్వరావుపేట సిఐ జితేందర్ రెడ్డిని వరంగల్ ఐజికి, నలుగురు కానిస్టేబుల్స్‌ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్‌పి కార్యాలయానికి అటాచ్ చేశారు. తన భర్త ఆత్మహత్యకు సిఐ జితేందర్, నలుగురు కానిస్టేబుల్స్ కారణమని ఎస్‌ఐ శ్రీరాముల శ్రీను భార్య కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్‌ఐ శ్రీరాముల శ్రీను గత జూన్ 30న మ హబూబాబాద్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు.

వారం రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం వేకువజామున తుదిశ్వాస
విడిచారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మణుగూ రు పోలీస్‌స్టేషన్ నుంచి అశ్వారావుపేట పోలీ స్ స్టేషన్‌కు ఎస్‌ఐ శ్రీను బదిలీపై వెళ్లారు. ఆ యన స్వగ్రామం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేట. 2014లో ఎస్‌ఐగా ఎంపికయ్యారు. అశ్వారావుపేట సీఐ జితేందర్ రెడ్డి, కానిస్టేబుల్స్ శేఖర్, శివ నాగరాజు, సన్యాసినాయుడు, సుభాని పనిలో ఆయన సహకరించలేదని ఎస్‌ఐ శ్రీను ఓ వీడియోలో తెలిపారు. అలాగే తనను తీవ్రం గా వేధించారని ఆ వీడియోలో పేర్కొన్నారు. కులం పేరు తో కించపరిచేవారని ఆవేదన వ్యక్తం చేశారు. సహచర సిబ్బంది వేధింపులు ఎక్కువ య్యా యన్నారు. మరోవైపు సిఐ జితేందర్ రెడ్డి నా లుగు నెలల్లోనే నాలుగు మెమోలు ఇచ్చారని గోడు వెళ్లబోసుకున్నారు. ఉన్నతాధికారుల కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, బదిలీ కోసం చేసిన ప్రయత్నాలు ఆలస్యమయ్యాయని చెప్పారు. అనంతరం ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

గుండెపోటుతో ఎస్‌ఐ మేనత్త మృతి

వారం రోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్‌ఐ శ్రీరాముల శ్రీను మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతి వార్తతో శోకసంద్రంలో మునిగిపోయిన వారి కుటుంబంలో మరో విషాదం అలుముకుంది. ఎస్‌ఐ శ్రీరాముల శ్రీను మరణవార్త విని ఆయన మే నత్త రాజమ్మ గుండెపోటుతో కన్నుమూశారు. నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండ లం నాచినపల్లి గ్రామానికి చెందిన మేనత్త రా జమ్మ శ్రీరాముల శ్రీను మృతి వార్త తెలియగా నే కుప్పకూలిపోయింది. ఇంట్లోనే గుండెపోటుతో కన్నుమూసింది. ఆమె భౌతికకాయా న్ని సందర్శించిన నర్సంపేట మాజీ ఎంఎల్‌ఎ పెద్ది సుదర్శన్ రెడ్డి నివాళులర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News