- Advertisement -
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 13,766 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పటిష్ట బందోబస్తు చేపట్టారు. 3 వేల సమస్యాత్మక పోలింగ్ బూత్లను గుర్తించిన ఎన్నికల అధికారులు.. 35 వేల మంది పోలీసులతో రంగంలోకి దించారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. ఢిల్లీ పోలీసు యంత్రాంగం పటిష్ఠమైన చర్యలు చేపట్టటింది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
కాగా, ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా.. 699 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బీజేపీ, ఆప్, కాంగ్రెస్ నేతల మధ్య పోటాపోటీ నెలకొంది. సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. ఈ నెల 8న ఓట్ల ఫలితాలను విడుదల చేయనున్నారు.
- Advertisement -