Friday, September 20, 2024

అతిషి ఢిల్లీ మంత్రివర్గంలో ముఖేశ్ అహ్లావత్, నలుగురు మంత్రులు: ఆప్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కాబోయే ముఖ్యమంత్రి అతిషితో కలిసి  తన నలుగురు ఢిల్లీ మంత్రులను నిలుపుకోనున్నది, వీరు గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అతిషి నేతృత్వంలోని మంత్రి మండలిలో గోపాల్ రాయ్, కైలాష్ గహ్లోత్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్ కొనసాగనున్నారు. ఢిల్లీ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ముఖేశ్ అహ్లావత్ కొత్త ముఖం అని ఆప్ ప్రకటించింది.

ముఖ్యమంత్రిగా నియమితులైన అతిషి , ఆమె క్యాబినెట్ సెప్టెంబర్ 21న ప్రమాణస్వీకారం చేస్తారని పార్టీ తెలిపింది. అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదవీ విరమణ చేసిన తర్వాత, అతిషి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు.

అరవింద్ కేజ్రీవాల్ జైలు శిక్ష సమయంలో ఆర్థిక, విద్య , రెవెన్యూ వంటి 14 పోర్ట్‌ ఫోలియోలను నిర్వహిస్తున్న అతిషి కీలక పాత్ర పోషించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News