Monday, April 28, 2025

దళితులపై దాడులు నిత్యకృత్యం : బిజెపి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో దళితులకు ఒరిగింది శూన్యమని, సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం జాప్యం చేస్తోందని బిజెపి ఎస్‌సి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పుబాష అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ నల్గొండ జిల్లాలోని పెద్ద ఆడిశర్లపల్లి మండలం వద్ధిపట్ల గ్రామంలో దళిత మహిళపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీల అమలుకు నోచుకోకపోగా దళితులపై హత్యలు,దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. గజ్వేల్ లో ఓ దళిత రైతు భూమిని అభివృద్ధి పేరు మీద ప్రభుత్వం గుంజుకుంటే ఆ రైతు గత్యంతరంలేక పురుగుల మందు తాగి చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News