Sunday, September 8, 2024

ఆస్ట్రేలియాకు అగ్రస్థానం.. మూడో స్థానానికి పడిపోయిన భారత్

- Advertisement -
- Advertisement -

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండిలి ఆదివారం విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. 121 పాయింట్లతో ఆసిస్.. పాకిస్థాన్ (120 పాయింట్ల)ను వెనక్కినెట్టి అగ్ర స్థానాన్ని దక్కించుకుంది. ఇక 114 పాయింట్లతో భారత్.. మూడో స్థానంలో కొనసాగుతోంది. గతేడాది శ్రీలంక పర్యటనలో వన్డే సిరీస్ కోల్పోయిన ఆసీస్.. ఆ తర్వాత వేగం పుంజుకుంది.

అసాధారణ ఆటతీరుతో ఆ తర్వాత సొంత గడ్డపై న్యూజిలాండ్ (3-0), ఇంగ్లాండ్ (3-0)ను క్లీన్‌స్వీప్ చేసింది. ఈ ఏడాది భారత్ పర్యటనలో కూడా 2-1 తో సిరీస్ కైవసం చేసుకుంది. ఇక ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న ఆసిస్.. తాజాగా రెండు వరుస విజయాలు నమోదు చేసి. నెం 1 జట్టుగా నిలిచింది. అయితే రెండో ప్లేస్‌లో ఉన్న పాకిస్థాన్.. ఆసియాకప్‌లో ఇంకా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. దీంతో మళ్లీ ర్యాంక్ మారే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News