Sunday, February 23, 2025

ఎవరికి లేని బాధ నాకేందుకు?: బాలినేని

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎంపి అభ్యర్థి మాగుంట అయితే బాగుంటుందనేది తన పోరాటం అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఒంగోలులో మీడియాతో మాజీ మంత్రి బాలినేని మాట్లాడారు. ఎంపి అభ్యర్థి ఎవరొచ్చినా ఒంగోలుతో తన గెలుపు తాను చూసుకుంటానని వివరణ ఇచ్చారు. మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్థులు పట్టీపట్టనట్టుగా ఉన్నారని, మిగిలిన అభ్యర్థులకు లేని బాధ తనకెందుకు? అని పేర్కొన్నారు. అధిష్టానం ఏం చెబితే అదే చేస్తానని, ఎంపి విషయం అడిగితే తాను పార్టీ మారుతున్నానని ప్రచారం చేస్తున్నారని వైసిపి ఎంఎల్ఎ బాలినేని ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News