వందల మంది బిజెపి
కార్యకర్తలను నక్సల్స్తో కలిసి
హత్య చేయించిన వ్యక్తి గద్దర్
కేంద్ర పథకాల పేర్లు మార్చితే
సహించేది లేదు రాష్ట్రాల
ప్రమేయం లేకుండా నేరుగా
కేంద్రమే ప్రజలకు అందిస్తుంది :
కేంద్రమంత్రి బండి సంజయ్
మన తెలంగాణ/హైదరాబాద్: పద్మ అవార్డుల జాబితాను పంపేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి పంపాలని కేంద్రమంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. వందల మంది బీజేపీ కార్యకరలను నమ్మి న సిద్ధాంతం కోసం ప్రజాస్వామ్య బద్దంగా ఆందోళన చేస్తే నక్సలైట్ల తో కలిసి హత్య చేయించిన వ్యక్తి గద్దర్ అని తెలిపారు. అటువంటి గ ద్దర్కు ఎట్లా పద్మ అవార్డులిస్తామని తెగేసి చెప్పారు. బీజేపీ రాష్ట్ర కా ర్యాలయంలో బండి సంజయ్ సోమవారం మీడియాతో మాట్లాడు తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల పేర్లను మార్చితే ఊరుకునేది లేదని, పేర్లు మార్చాలనుకుంటే మాత్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గరీబ్ కళ్యాణ్ యోజన వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా కేంద్రమే నేరుగా ప్రజలకే అందిస్తుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు.
అయితే పరిస్థితి అంతవరకు తీసుకురావొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని అన్నారు. ప్రజలందరికీ ఉచితంగా బియ్యం కేంద్రమే ఇస్తోందని, అందుకు గరీబ్ కళ్యాణ్ యోజన అని పేరు పెడితే తప్పేంటని? ప్రధాని ఫోటో ఎందుకు పెట్టరని నిలదీశారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో పేదలకు ఎట్టి పరిస్థితిల్లోనూ తాము అన్యాయం చేయబోమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఖర్చయ్యే సంక్షేమ పథకాలకు ఎవరి పేరు పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని, కాంగ్రెస్కు నచ్చితే ఒసామా బిన్ లాడెన్, దావూద్ ఇబ్రహీం పేర్లు పెట్టుకున్నా అభ్యంతరం లేదని సెటైర్ వేశారు. అభివృద్ధి విషయంలో కేంద్రం పూర్తిగా సహకరిస్తోందని, అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని అన్నారు. గత పదేళ్లలో రూ.12 లక్షల కోట్లకుపైగా కేంద్రం తెలంగాణకు ఖర్చు చేసిందని బండి సంజయ్ వివరించారు. గ్రామాల్లో జరిగిన అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే జరిగిందని అన్నారు.
మండలంలో ఒక గ్రామం ఎంపిక అంటే మోసమే అవుతుంది
ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేనేలేదని బండి సంజయ్ విమర్శించారు. మండలానికి ఒక గ్రామంలోనే నాలుగు పథకాలకు ఎంపిక చేసి లబ్ది చేయడమేంటని ప్రశ్నించారు. మిగిలిన గ్రామాల ప్రజలు కాంగ్రెస్కు ఓట్లేయలేదా? అని నిలదీశారు. రాష్ట్ర ప్రజలను ఇంత దుర్మార్గంగా మోసగిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ లబ్ది చేకూరుస్తామని చెప్పి మండలానికి ఒక గ్రామానికి లబ్ది చేకూర్చడం దారుణమని అన్నారు. గతంలో పీఎం ఆవాస్ యోజన పేరుతో 2 లక్షల 40 వేల ఇండ్లను కేంద్రం మంజూరు చేస్తే కేసీఆర్ ఒక్క ఇల్లు కట్టకుండా ప్రజలను రోడ్డున పడేసింది నిజం కాదా? అని గుర్తు చేశారు. డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు.
మల్కాజ్గిరి ఎంపి ఈటల మావోయిస్టు కాదు
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మావోయిస్టు కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కమ్యూనిస్టు భావజాలం వేరు, మావోయిస్టుగా చేయడం వేరని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలని భావిస్తున్న గద్దర్ అవార్డులను మా వోళ్లు తీసుకోరని స్పష్టం చేశారు.