Thursday, September 19, 2024

హసీనాకు ఆశ్రయం.. అయినా భారత్ తో బంధం తెగదు: బంగ్లాదేశ్

- Advertisement -
- Advertisement -

ఢాకా : షేక్ హసీనా భారత్‌లో ఉండటంపై బంగ్లాదేశ్ అధికారికంగా తొలిసారిగా స్పందించింది. ఆమె భారత్ నివాసంతో ఇరుదేశాల సంబంధాలు దెబ్బతినే అవకాశం లేదని విదేశాంగ వ్యవహారాల సలహాదారు మహమ్మద్ తౌహీద్ హుస్సెన్ తెలిపారు. ఇక్కడ ఆమె సుదీర్ఘకాలం ఉంటుందా? తాత్కాలికమా? సంబంధాలపై ప్రభావం పడుతుందా? అనేవి ఊహాజనిత ప్రశ్నలు అవుతాయి. బంగ్లా వీడి, భారత్ రాక వల్ల ఏదో జరిగిపోతుందని అనుకోవడం భ్రమే అవుతుందన్నారు.

ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు పరస్పర అవసరం. ఏదో ఒక కారణంతో వీటిని ఏ పక్షం దెబ్బతీసుకోదని తౌహీద్ ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో తెలిపారు. ద్వైపాక్షిక మేలు బాగోగులపైనే స్నేహం ఆధారపడి ఉంటుంది. వీటికి విఘాతం ఏర్పడితే మిత్రత్వం చెదిరిపోతుందని విదేశాంగ వ్యవహారాలలో అగ్రస్థాయి సలహాదారుడైన తౌహీద్ చెప్పారు.

ఇరుగుపొరుగుదేశాలుగా అంతా సవ్యరీతిలోనే వ్యవహారం ఉంటుంది. తమకు సంబంధించినంత వరకూ భారత్‌తో సత్సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తామని వివరించారు. సోమవారమే ఈ ప్రతినిధి ఢాకాలోని పలువురు విదేశీ దౌత్య ప్రతినిధులకు దేశ పరిస్థితిని వివరించారు. అంతా అదుపులో ఉందని తెలిపారు. ఈ క్రమంలో సహకరించాలని కోరారు. దౌత్యవేత్తలలో భారత హై కమిషనర్ ప్రణయ్ వర్మ కూడా ఉన్నారు. మైనార్టీలు ప్రత్యేకించి హిందువుల భద్రత గురించి వర్మ తమ స్పందన తెలిపినట్లు వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News