Friday, September 20, 2024

116 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన బంగ్లా

- Advertisement -
- Advertisement -

చెన్నై: చిదంబరం స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 38 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 116 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఇండియా 260 పరుగుల ఆధిక్యంలో ఉంది. బంగ్లా బ్యాట్స్‌మెన్లలో షకిబ్ అల్ హసన్(32), లిట్టన్ దాస్(22), నిజ్ముల్ హుస్సేన్ శాంటో(20), మెహిడీ హసన్ మిరాజ్(12), హసన్ మహ్ముద్(09), ముష్పీకర్ రహీమ్(08), షాద్మాన్ ఇస్లామ్(02), జకీర్ హసన్(03), మోమినల్ హక్(0) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో మెమడి హసన్ మిరాజ్(13), టస్కీన్ అహ్మద్(0) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు తీయగా అకావ్ దీప్, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు, మహ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీశాడు. భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News