Friday, September 20, 2024

బిఎస్‌ఎఫ్ కాల్పులలో ఇద్దరు బంగ్లాదేశీయులు హతం

- Advertisement -
- Advertisement -

Two alleged Bangladeshi cattle smugglers shot dead in Bengal

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహార్‌లో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి శుక్రవారం పశువులను అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించిన కొందరు బంగ్లాదేశీయులపై భారత సరిహద్దు భద్రతా దళ సిబ్బంది కాల్పులు జరపడంతో ఇద్దరు బంగ్లాదేశీయులు మరణించారు. ఈ సంఘటనలో ఒక బిఎస్‌ఎఫ్ జవాను కూడా గాయపడగా ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందచేస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో బంగ్లాదేశ్‌కు చెందిన కొందరు స్మగ్లర్లు భారత భూభాగంలోకి చొరబడి పశువులను అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నిచంగా వారిపై బిఎస్‌ఎఫ్ జవాన్లు కాల్పులు జరిపినట్లు బిఎస్‌ఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు. బంగ్లాదేశీ స్మగ్లర్లు బిఎస్‌ఎఫ్ జవాన్లపై ఇనుప రాడ్లు, కర్రలతో డాదులు చేయడానికి ప్రయత్నించారని, ఈ సంఘటనలో ఇద్దరు బంగ్లాదేశీ స్మగ్లర్ల మృతదేహాలు లభించాయని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News