Thursday, September 19, 2024

మియాపూర్‌లో మూడో ఫర్నిచర్ స్టోర్ ప్రారంభించిన బే విండో

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మియాపూర్‌లో తమ మూడవ ఫర్నిచర్ స్టోర్‌ను ప్రారంభించినట్లు బే విండో వెల్లడించింది. బే విండో మొదటి రెండు స్టోర్ లు జూబ్లీ హిల్స్‌, గచ్చిబౌలిలో వున్నాయి. లివింగ్ రూమ్‌లు, డైనింగ్ రూమ్‌లు, బెడ్‌రూమ్‌లను మార్చడానికి రూపొందించిన విస్తృతమైన ఫర్నిచర్‌ను బే విండో అందిస్తుంది. ఇంటి అలంకరణ, లైటింగ్ సమగ్ర ఎంపికను కూడా స్టోర్ అందిస్తుంది. ఇది ఇంటీరియర్ డిజైన్ అవసరాలకు ఏకీకృత పరిష్కారాన్ని సైతం అందిస్తుంది.

గ్లోబల్ డిజైనర్లచే రూపొందించబడిన ఫర్నిచర్ కలెక్షన్లలో ఆరు విలక్షణమైన శైలులు ఉన్నాయి: స్కాండి లివింగ్, ఆర్ట్ డెకో, లక్స్ ఎడిట్, ఎత్నిక్ చిక్, మోడరన్ వోగ్. ఇవి ప్రతి అభిరుచికి, ప్రాధాన్యతకు సరిపోయేలా ఏదో ఉందని నిర్ధారిస్తాయి. ప్రారంభోత్సవ వేడుకలో భాగంగా బే విండో ఫర్నిచర్‌పై ప్రత్యేకమైన ఇన్-స్టోర్ డీల్స్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లను అందిస్తోంది.

“మా మియాపూర్ స్టోర్ ప్రారంభంతో హైదరాబాద్‌లో మా కార్యకలాపాలను విస్తరించడం మాకు చాలా ఆనందంగా ఉంది” అని బే విండో వ్యవస్థాపకుడు సిద్ధాంత్ ఆనంద్ అన్నారు. “అత్యున్నత-నాణ్యత, డిజైనర్ ఫర్నిచర్ అందరికీ అందుబాటులో ఉండేలా చేయడమే తమ లక్ష్యం. ఈ కొత్త స్టోర్‌తో, మేము మా కస్టమర్‌లకు వినూత్నమైన డిజైన్‌లను, అసాధారణమైన విలువను అందిస్తూనే ఉంటాము, వారి ప్రత్యేక శైలులను ప్రతిబింబించేలా గృహాలను రూపొందించడంలో వారికి సహాయం చేస్తాము. 2024 చివరి నాటికి హైదరాబాద్‌లో ఐదు స్టోర్లు. 2025 చివరి నాటికి హైదరాబాద్ వెలుపల మరో 5 స్టోర్లను ప్రారంభించాలని చూస్తున్నాం” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News