Tuesday, September 17, 2024

జియో యూజర్లకు గుడ్ న్యూస్..

- Advertisement -
- Advertisement -

తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలతో రీఛార్జ్ ప్లాన్ల కోసం చూస్తున్నారా?..దేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీలలో ఒకటైన రిలయన్స్ జియో అద్భుతమైన ప్లాన్ తమ యూజర్లకు అందించింది. ఈ ప్లాన్ రూ. 200 కంటే తక్కువ ధరతో ప్లాన్‌ ఉండడం విశేషం. ఈ ప్లాన్ తో వినియోగదారులు 5G అపరిమిత డేటా సౌకర్యాన్ని కూడా పొందుతారు. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా ప్లాన్ వివరాలు మొత్తం తెలుసుకుందాం.

రూ.198 రీఛార్జ్ ప్లాన్

రూ.198 రూపాయల ప్లాన్‌ను రిలయన్స్ జియో అందిస్తోంది. దీనితో అపరిమిత 5G డేటా ప్రయోజనం కూడా పొందుతారు. ఇది కాకుండా..అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దీని ద్వారా మీరు ఫోన్‌లో మాట్లాడటం నుండి ఇంటర్నెట్‌ని ఉపయోగించడం వరకు సౌకర్యాలను పొందవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే..రిలయన్స్ జియో రూ.198 ప్లాన్ 14 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు మొత్తం 28GB డేటా ప్రయోజనాన్ని పొందుతారు. ఇక డేటా అయితే రోజుకు 2 GB పొందవచ్చు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News