- Advertisement -
తెలంగాణ భూ భారతి (రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్స్) యాక్ట్, 2025 ఆవిష్కరణకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా దీనిని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా సమాచారం. భూ భారతి చట్టం ప్రొవిజన్స్తో కొత్త పోర్టల్ను ప్రారంభించనున్నారు. రాజ్యాంగ నిర్మాణ అంబేద్కర్ జయంతి రోజునే సామాన్య రైతులకు మేలైన సేవలందించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నట్టుగా తెలిసింది. శిల్ప కళావేదికలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారని అధికారికవర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, శిల్పారామం స్పెషల్ ఆఫీసర్లను సిసిఎల్ఏ నవీన్ మిట్టల్ ఆదేశించినట్టుగా తెలిసింది.
- Advertisement -