Tuesday, September 17, 2024

కీలక మలుపు

- Advertisement -
- Advertisement -

హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. రాజ్ తరుణ్ తనకు కావాలని లావణ్య చెబు తోంది. మరోవైపు పోలీసులు ఈ కేసులో రాజ్ తరుణ్ నిందితుడేనని చెబుతున్నారు. రాజ్ తరుణ్‌లావణ్య పదేళ్ల పాటు సహ జీవనం చేశారని కూడా పోలీసులు చెబుతున్నారు. రాజ్‌తరుణ్-లావణ్య కేసులో పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఛార్జ్‌షీట్‌లో రాజ్‌తరుణ్‌ను పోలీసులు నింది తుడిగా చేర్చారు. లావణ్యతో రాజ్‌తరుణ్ పదేళ్లు సహజీవనం చేసినట్లు పేర్కొన్నారు. పదేళ్లపాటు రాజ్‌తరుణ్-లావణ్య ఒకే ఇంట్లో ఉన్నారని చారి ్జషీట్‌లో వెల్లడించారు. లావణ్య చెబుతున్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. లావణ్య ఇంటి వద్ద పోలీసులు సాక్ష్యాలు సేక రించారు. ఇప్పటికే ఈ కేసులో రాజ్‌తరుణ్ ముందస్తు బెయిల్ తీసుకున్నాడు. అయితే ఈ విషయమై లావణ్య మాట్లా డుతూ రాజ్ తరుణ్‌పై ఛార్జ్ షీట్ దాఖలు చేయడం శుభ పరిణామమని పేర్కొంది. తనను ఎన్నో మాటలు అన్నారని, చివరికి న్యాయం గెలుస్తుం దని తాను భావిస్తున్నా నని వెల్లడించింది. రాజ్ తరుణ్‌కి వ్యతిరేకంగా వెళ్లాలని తనకు లేదని పేర్కొంది.

తనకు రాజ్ తరుణ్ కావాలని వెల్లడించింది. రాజ్ తరుణ్ ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత మానసికంగా ఎంతో బాధపడ్డానని తెలిపింది. శేఖర్ భాష అనే వ్యక్తిని అస్త్రంగా ఉపయోగించి తనపై ఎన్నో నిందలు వేశారని లావణ్య వెల్లడించింది. రాజ్ తరుణ్ శిక్ష అనుభవించాలని తాను కోరుకోను, కానీ తనకు న్యాయం చేయాలని కోరుకుంటున్నానని వెల్ల డించింది. రాజ్ తరుణ్, తాను పదేళ్లపాటు కలిసి సంసారం చేశామనేది అనేది వాస్తవమని లావణ్య వెల్లడిం చింది. వాటికి సంబంధించిన ఆధారా లన్నీ పోలీసులకు ఇచ్చానని వెల్లడించింది. హీరోయిన్ మాల్వి మల్హోత్రా వల్ల తనను రాజ్ తరుణ్ వదిలించుకోవాలని చూశాడని తెలిపింది. కేసు ను తప్పుదోవ పట్టించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించింది. మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ ఇద్దరికీ ఎఫైర్ ఉందని మరో మారు లావ ణ్య పేర్కొంది. వాటికి సంబంధించిన ఆధారాలను సైతం పోలీసులకు ఇచ్చానని లావణ్య తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News