Sunday, February 23, 2025

బైక్​ను ఢీకొట్టిన కారు: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

అమ్రాబాద్ : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని మద్దిమడుగు అచ్చంపేట ప్రధాన రహదారిపై ఈదులబావి గేటు సమీపంలో శనివారం సాయంత్ర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకోచ్చిన కారు అదుపుతప్పి బైక్ ను ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అమ్రాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News