Sunday, July 7, 2024

తెలంగాణలో ఫిఫ్టీ..ఫిఫ్టీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలకు గానూ కాంగ్రెస్, బిజెపి పార్టీలు సమానంగా చెరో 8 స్థానాలు దక్కించుకున్నాయి. కాంగ్రెస్ ఎనిమిది చోట్ల విజయం సాధించగా, బిజె పి 8 స్థానాల్లో విజయం సాధించింది. ఎంఐఎం త న సీటును పదిలపరుచుకోగా, బిఆర్‌ఎస్ ఎక్కడా ఖాతా తెరవలేకపోయింది. ఖమ్మంలో నామ నాగేశ్వరరావు (బిఆర్‌ఎస్)పై రఘురాం రెడ్డి (కాంగ్రెస్) విజయం సాధించగా, వరంగల్‌లో ఆరూరి రమేశ్ (బిజెపి)పై కడియం కావ్య (కాంగ్రెస్) విజయ దుం దుభి మోగించారు. నల్గొండలో సైదిరెడ్డి (బిజెపి)పై కుందూరు రఘువీర్ రెడ్డి (కాంగ్రెస్) గెలవగా, మహబూబాబాద్‌లో మాలోత్ కవిత (బిఆర్‌ఎస్)పై బలరాం నాయక్ (కాంగ్రెస్) గెలుపొందారు. జహీరాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్ విజ యం సాధించారు. భువనగిరిలో చామల కిరణ్ కు మార్ రెడ్డి (కాంగ్రెస్) జయకేతనం ఎగురవేశారు. నాగర్‌కర్నూల్‌లో మల్లు రవి (కాంగ్రెస్), పెద్దపల్లి లో గడ్డం వంశీకృష్ణ (కాంగ్రెస్) విజయం సాధించా రు. ఎంఐఎం పార్టీ ఒక్క స్థానంలో పోటీ చేయగా, ఆ పార్టీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ వరుసగా ఐదోసారి హైదరాబాద్ ఎంపీగా విజయం సాధించారు.

లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు వీరే..

నియోజకవర్గం గెలిచిన అభ్యర్థి పార్టీ మెజార్టీ

నల్గొండ కుందూరు రఘువీర్ రెడ్డి కాంగ్రెస్ 5,59,905
ఖమ్మం రఘురాంరెడ్డి కాంగ్రెస్ 4,67,847
వరంగల్ కడియం కావ్య కాంగ్రెస్ 2,20,339
మహబూబాబాద్ బలరాం నాయక్ కాంగ్రెస్ 3,49,165
జహీరాబాద్ సురేశ్ షెట్కార్ కాంగ్రెస్ 46,188
భువనగిరి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ 2,22,170
నాగర్‌కర్నూల్ మల్లు రవి కాంగ్రెస్ 94,414
పెద్దపల్లి గడ్డం వంశీకృష్ణ కాంగ్రెస్ 1,31,364
సికింద్రాబాద్ కిషన్‌రెడ్డి బిజెపి 49,944
మల్కాజ్‌గిరి ఈటల రాజేందర్ బిజెపి 3,91475
చేవెళ్ల కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బిజెపి 1,72,897
మహబూబ్‌నగర్ డి.కె.అరుణ బిజెపి 4,500
మెదక్ రఘునందన్‌రావు బిజెపి 39,139
కరీంనగర్ బండి సంజయ్ బిజెపి 2,25,209
నిజామాబాద్ ధర్మపురి అర్వింద్ బిజెపి 1,09,241
అదిలాబాద్ గోడం నగేష్ బిజెపి 90,652
హైదరాబాద్ అసదుద్దీన్ ఎంఐఎం 3,38,087

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News