Sunday, February 23, 2025

పలివెలలో బిజెపి, టిఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి

- Advertisement -
- Advertisement -

KTR
మునుగోడు: మునుగోడు మండలం పలివెలలో ప్రచారం చివరి రోజున ఉద్రిక్తత నెలకొంది. భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు పరస్పసం దాడులు జరుపుకున్నారు. ప్రచారం నిర్వహిస్తుండగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు రంగంలోకి దిగి దాడులకు పాల్పడిన వారిని చెదరగొట్టారు. బిజెపి నాయకుడు ఈటల రాజేందర్ కాన్వాయ్‌పై కూడా రాళ్ల దాడి జరిగింది. ఇదిలావుండగా ప్రచార కార్యక్రమంలో మంత్రి కె. రామారావు ఓడిపోయేవారు ఏదో పేచీపెట్టుకోవాలని చూస్తుంటారని, టిఆర్ఎస్ కార్యకర్తలు సంయమనం పాటించాలని, వారి సంగతి పోలీసులు చూసుకుంటారని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News