Monday, July 1, 2024

కదిరిలో బిజెపి నాయకుడి దాడి

- Advertisement -
- Advertisement -

కదిరి: సత్యసాయి జిల్లాలోని కదిరిలో ఓ భూ వివాదం విషయంలో, డబ్బు విషయంలో ఓ బిజెపి నాయకుడు, అడ్వొకేట్ మీద దాడి చేశాడు. సంబంధిత వర్గీయుల కథనం ప్రకారం అడ్వొకేట్ రామస్వామి నాయుడు, స్థానిక బిజెపి నాయకుడు తలుపుల గంగాధర్, ఆయన మిత్రుడు కుటగుల్ల శ్రీనివాస్ తో చేతులు కలిపి భూవివాదాలు, డబ్బు వ్యవహారాలు చేస్తున్నాడు. కాగా గంగాధర్ తన అనుచరులతో కలిసి శుక్రవారం రామస్వామి నాయుడు ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత కదిరిలోని రామస్వామి ఇంటిని ధ్వంసం చేయడమేకాక, రామస్వామి మీద కూడా చేయిచేసుకున్నాడని సమాచారం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News