Saturday, April 26, 2025

ప్రజాస్వామ్యానికి చీకటి రోజు : పంజాబ్ సిఎం

- Advertisement -
- Advertisement -

చండీగఢ్ మేయర్ పదవికి ఎన్నికలలో ‘వంచన’ జరిగిందని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మంగళవారం ఆరోపించారు. మంగళవారాన్ని దేశ ప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా జనం గుర్తు ఉంచుకుంటారని మాన్ అన్నారు. మేయర్ పదవితో సహా మూడు పదవులనూ బిజెపి కైవసం చేసుకున్న తరువాత మాన్ ఆ ఆరోపణ చేశారు. కాంగ్రెస్, ఆప్ కూటమిని బిజెపి ఈ ఎన్నికల్లో ఓడించింది. ‘వంచన చేసిన వారు పార్లమెంటరీ ఎన్నికల్లో ఎంత మేరకైనా తెగిస్తారనేదే’ తన ఆందోళన అని మాన్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News