Thursday, April 10, 2025

నంద్యాలలో పేలిన నాటుబాంబు: ఆరుగురికి గాయాలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాలలో నాటు బాంబు పేలుడు కలకలం సృష్టించింది. కల్లు దుకాణం దగ్గర నాటు బాంబు పేలడంతో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాటుబాంబు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు?.. నాటుబాంబుతో ఎవరిని హత్య చేయాలనుకున్నారు? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News