Sunday, February 23, 2025

బట్టలు ఆరేస్తుండగా కరెంట్ షాక్ తో దంపతుల మృతి

- Advertisement -
- Advertisement -

బోంరాస్ పేట: వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట మండలం బురహన్పూర్ గ్రామంలో సోమవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. ఇంటి వాకిలిలో ఉన్న ఇనుప తీగకు ఉతికిన బట్టలు ఆర వేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి గ్రామానికి చెందిన బోయిని లక్ష్మణ్ (40), బోయిని లక్ష్మీ(38) అనే దంపతులు మృతి చెందారు. ఉతికిన బట్టలు ఆరవేయ బోతుండగా విద్యుత్ షాక్ గురి కాగా, అతడిని రక్షించబోయి భార్యకు సైతం షాక్ తగిలి దుర్మరణం చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాలనీలో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News