లక్నో: పెళ్లి, రిసెప్షన్ అంగరంగా వైభవంగా జరిగింది. వధువు, వరుడు కుటుంబ సభ్యులు పెళ్లి వేడుకకు హాజరయ్యారు. వరుడు తనకు బుల్లెట్ వాహనం పెట్టాలని అలిగాడు. తమ ఆర్థిక పరిస్థితి సరిగా లేదని అల్లుడికి వాహనం ఇవ్వలేమని వధువు కుటుంబ సభ్యులు అతడిని బతిలాడారు. వరడు వినిపించుకోకపోవడంతో రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. వెంటనే వధువు వచ్చి వరుడు చెంపపై చెళ్లుమనిపించిని సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అమేథీ జిల్లా సలీమ్పూర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మహమ్మద్ ఇమ్రాన్ సాజ్తో అహ్మద్ కూతురుకు పెళ్లి జరిగింది. ఇమ్రాన్ సాజ్కు తనకు బుల్లెట్ వాహనం కావాలని అడగడంతో రెండు కుటుంబాల మధ్య జరిగింది. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో ఆమె వెంటనే వరుడి చెంపను వధువు చెళ్లుమనిపించింది. ఇరువర్గాలు దాడులకు పాల్పడడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వాళ్లకు నచ్చజెప్పారు. వరుడు మాత్రం తన విడాకులు కావాలని పట్టుబట్టడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
బుల్లెట్ కావాలని డిమాండ్… వరుడి చెంప చెళ్లుమనిపించిన వధువు
- Advertisement -
- Advertisement -
- Advertisement -