Friday, September 20, 2024

కరోనాతో నవవరుడు మృతి

- Advertisement -
- Advertisement -

Bride groom dead with corona virus

భువనేశ్వర్: పెళ్లైన ఐదు రోజులకే నవవరుడు కరోనాతో మృతి చెందిన సంఘటన ఒడిశా రాష్ట్రం కేంద్రపడ జిల్లాలో జరిగింది. జయదుర్గపడ గ్రామానికి చెందిన సంజయ్ నాయక్(26) బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. మే 9న పెళ్లి కోసమని సొంతూరుకు వచ్చాడు. పెళ్లి జరిగిన అనంతరం జలుబు రావడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో జాజ్పూర్ జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సంజయ్ మృత్యువాతపడ్డాడు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News