- Advertisement -
మన తెలంగాణ/మోత్కూరు: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దాచారం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నేవూరి ధర్మేందర్ రెడ్డి తల్లి పిచ్చమ్మ ఇటీవల మృతి చెందగా సోమవారం జరిగిన దశ దిన కర్మలో పలువురు నాయకులు పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్, నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్, జిహెచ్ఎంసి మాజీ మేయర్ బొంతు రాంమోహన్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు దూదిమెట్ల బాలరాజు, సిహెచ్.రాఖేష్, వై.సతీష్ రెడ్డి, గెల్లు శ్రీనివాస్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చాడ కిషన్, రావుల శ్వ్రణ్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, యుగంధర్ రెడ్డి తదితరులు ధర్మేందర్ రెడ్డిని, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
- Advertisement -