Sunday, July 7, 2024

మళ్ళీ మంచి రోజులొస్తాయి: ఎంఎల్ఎలకు ధైర్యం చెప్పిన కెసిఆర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్/ మర్కుక్: కొందరు పార్టీ మారినంత మాత్రాన బిఆర్‌ఎస్‌కు వచ్చే నష్టమేమీ లేదని గులాబీ బాస్ కెసిఆర్ వ్యాఖ్యానించారు. భవిష్యత్‌లో బిఆర్‌ఎస్‌కు మంచి రోజులు రానున్నాయని పార్టీ అధినేత ఆశాభావం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండ లం ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో మంగళవారం బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు కెసిఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారితో సమావేశమైన కెసిఆర్ బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు పార్టీ మారడంపై చర్చించారు.

అలాగే బిఆర్‌ఎస్‌లో జరుగుతున్న తాజా పరిణామాలపై సమాలోచనలు చేశారు. ఈ సందర్భంగా మాజీ సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి వారు పార్టీ మారడాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. కొందరు పార్టీ మారినంత మాత్రాన బిఆర్‌ఎస్‌కు వచ్చే నష్టమేమీ లేదని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇలాంటివి ఎన్ని జరిగినా భయపడలేదని ఎంఎల్‌ఎలకు ధైర్యం చెప్పారు.

హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని కెసిఆర్ నేతలతో పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక నుంచి ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, పార్టీ నేతలతో తరచూ కలుస్తానని కెసిఆర్ పేర్కొన్నారు. కెసిఆర్‌ను కలిసిన వారిలో మాజీ మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావు, ప్రశాంత్ రెడ్డిలతో పాటు ఎంఎల్‌ఎలు వివేకానంద్, గోపీనాథ్, ప్రకాశ్ గౌడ్, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, ముఠా గోపాల్, ఎంఎల్‌సిలు షేరి సుభాశ్ రెడ్డి, మాజీ మంత్రి జోగు రామన్న, పార్టీ నాయకులు క్యామ మల్లేష్, రావుల శ్రీధర్ రెడ్డి తదితరులులతో పాటు మరికొంత మంది ఉన్నారు. వీరందరికీ మాజీ సిఎం కెసిఆర్ దిశానిర్దేశం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News