Monday, March 24, 2025

సింగిల్‌గానే మళ్లీ అధికారంలోకి…

- Advertisement -
- Advertisement -

తెలంగాణ కోసం ఎప్పటికీ పోరాడేది
బిఆర్‌ఎస్సే నోటికొచ్చిన అబద్ధపు హామీలు
ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పదేళ్ల
బిఆర్‌ఎస్ పాలనలో ప్రజలకు ఎలాంటి
ఇబ్బందులు లేకుండే దోపిడీదారులు మళ్లీ
మోహరిస్తున్నారు ఒక్కో కార్యకర్త ఒక
కెసిఆర్ కావాలి కాంగ్రెస్ ప్రభుత్వ
వైఫల్యాలను ఎండగట్టాలి : కెసిఆర్
మన తెలంగాణ/మర్కుక్ : రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సింగిల్ గానే తమ పార్టీ అధికారంలోకి వస్తుంద ని బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ స్పష్టం చేశారు. పదేళ్ల్ల బిఆర్‌ఎస్ ప్రగతి పాలనలో జలాలతో అలుగెల్లిన గోదావరి కా ళేశ్వరం ప్రాజెక్టులు, కాంగ్రెస్ పాలన తెచ్చిన కరువుతో చెరువులు కుంటలు అడుగంటి ఎడారిగా మారడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిన గోదావరి తల్లి కన్నీటి గో సను… కాళేశ్వరం నీళ్ళందక పంటలు ఎండిన రైతన్నల గుండె కోతను.. సభ్య సమాజానికి తెలిపేందుకు.. రామగుండం మాజీ ఎంఎల్‌ఎ, పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో…రామగుండం నుంచి ఎర్రవల్లి దాకా 200 మందితో కూడిన 180 కిలోమీటర్ల పాదయాత్ర వారం రోజుల పాటు సాగి శనివారం ముగిసింది. ఈ ముగింపు సభ కెసిఆర్ అధ్యక్షతన ఎర్రవల్లిలో జరిగింది. ఈ సందర్భంగా పార్టీ చీఫ్ కెసిఆర్ మాట్లాడు తూ..‘తెలంగాణను కొట్లాడి సాధించుకున్నాం. ఎంతో జా గ్రత్తగా నిలబెట్టుకున్నం.

ప్రజలు ఏమనుకున్నారో ఏందో కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్నరు. అదీ వాళ్లిష్టం. కానీ దా ని ఫలితం లోకం చూస్తున్నది..ఇన్నాళ్ళు లేని నీటి గోస ఇప్పుడెందుకు వచ్చినట్టు..? తెలంగాణకు నీళ్లు ఇవ్వాలనే పాలనా ప్రాధాన్యతను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయ డం వల్లే తెలంగాణకు సాగునీరు తాగునీరు సమస్య వ చ్చింది. తెలంగాణ పాలకులు మొదటి నుంచీ నీటి సమస్యను ఆర్థిక సమస్యగా చూడడం ఒక అవలక్షణంగా మా ర్చుకున్నారు. అని అన్నారు. తెలంగాణ రాగానే నాటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం, వ్యవసాయ స్థిరీకరణ కోసం దృష్టి సారించి పటిష్టమైన కార్యాచరణను అమలు చేసింది. రై తు వ్యవసాయ అభివృద్ధి పాలనాప్రాధాన్యతాంశంగా మా ప్రభుత్వం ఎంచుకుంది. అందులో భాగంగా ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందివ్వడం. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా అందించడం. పంట పెట్టుబ డి సాయం చేయడం. పండిన ధాన్యాన్ని గిట్టుబాటు ధర కు ప్రభుత్వమే కొనుగోలు చేయడం అనే అంశాలను ప్రా ధాన్యతగా తీసుకొని ఎన్ని కష్టాలొచ్చినా నాటి మా ప్రభుత్వం అమలు చేసింది’ అని అన్నారు.

పదేళ్లపాటు రాష్ట్ర రైతాంగం ప్రజలు ఎటువంటి బాధలు లేకుండా జీవించారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం వీటిని అందించడానికి ఖర్చు అవుతుందని వెనకాడుతున్నది. ఇది సరికాదు. ఎప్పుడైనా ప్రభుత్వాలే రైతుల దగ్గర భూమి శిస్తులు వసూలు చేసిన సందర్భాలున్నాయి. కానీ ఉల్టా ప్రభుత్వమే రైతుకు భరోసా కల్పించే విధంగా పంట పెట్టుబడి అందించిన పరిస్థితి ఈ దేశంలో ఉన్నదా..? రైతు సంక్షేమం దిశగా కేవలం బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆలోచన ఫలితమే’ అని అన్నారు. ఈ పరిస్థితులను తెలంగాణ సమాజం ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. మనం ఇచ్చిన కరెంటు ఎటు పోయింది? మనం ఇచ్చిన మిషన్ భగీరథ తాగునీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎండాకాలంలో కూడా మత్తడి దునికిన చెరువులు ఇప్పుడు ఎందుకు నీరు లేక ఎండిపోతున్నాయో.. ప్రజలు అర్థం చేసుకోవాలి.

పల్లెల నుంచి హైదరాబాద్ వంటి పట్టణాలకు బతకడానికి వచ్చిన పేదలకు నాటి మన ప్రభుత్వం అండగా నిలిచింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వము వాళ్ల ఇండ్లను కూల్చివేస్తున్నది. గోరటి వెంకన్న లాంటి కవులు రాసిన, గల్లి చిన్నది గరీబోళ్ల కథ పెద్దది వంటి పాటల స్ఫూర్తితో, పేదలకు ఇండ్ల నిర్మాణం చేపట్టిన’ అని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లను హైడ్రా పేరుతో కూల్చేస్తుంటే …కెసిఆర్ అన్నా ఎక్కడున్నావు రావే… రావే…అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. కానీ నన్ను వోడగొట్టి ఇంట్ల కూర్చోబెట్టిండ్రు కదా.. నేను ఎక్కడికి రావాలె? కత్తి ఒకనికి ఇచ్చి యుద్ధం ఒకరిని చేయమంటే ఎట్లా అయితది? అని ప్రశ్నించారు. ‘ కేసీఆర్ ప్రభుత్వంలో పదేళ్లపాటు ప్రశాంతంగా బతికినాము అని తెలంగాణ సమాజం భావిస్తున్నది. ఇప్పుడు తిరిగి మళ్లీ పాదయాత్రలు, ధర్నాలు, కొట్లాటలు మొదలైనయి. తెలంగాణకు ఎప్పుడు ఇగ ఇదే లొల్లా..? ప్రశాంతంగా బతుకొద్దా ..?తెలంగాణ సమాజం ఇకనైనా తెలివిగా ఆలోచన చేయాలి’ అని హితవు పలికారు. పాదయాత్రలు కాదు.. మన మనసుతో యాత్రలు చేయాలి.. బుర్రతో ఆలోచనలు చేయాలి… ప్రశాంతంగా ఉన్న తెలంగాణను పాడు చేసుకునే ఆలోచనలు కాకుండా మన భవిష్యత్తు తరాలను మరింతగా బాగు చేసుకునే దిశగా ఆలోచన చేయాలి… తెలంగాణకు ప్రధాన శత్రువే కాంగ్రెస్ అని కెసిఆర్ పునరుద్ఘాటించారు.

తెలంగాణను ఆంధ్రలో కలపడం నుంచి, 19 69 లో వందలాది మంది బిడ్డలను పొట్టన పెట్టుకోవడం నుంచి, నీళ్లు నిధులు , నియామకాలు విషయంలో తెలంగాణకు దశాబ్దాల కాలంగా జరిగిన అన్యాయాలను వివరించారు. ‘తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను మొదటినుంచి కనీస స్థాయిలో ప్రతిఘటించలేని నాటి నాయకత్వం ఎంతో నష్టం చేసిందనే ఆవేదన, వాళ్ళ తెలివి తక్కువతనం చూసి, ఉద్యమ కాలంలో నేను వాళ్ళను దద్దమ్మలు.. సన్నాసులు అని.. తెలంగాణ సమాజం తరఫున అన్నాను తప్ప, నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం ఎందుకు ఉంటుంది..?

తెలంగాణ సంపద మీద గుంటనక్కలు కన్నేసి ఉన్నారు. ఇప్పుడు ఉన్న పాలకులు సరిగా చేస్తలేరట, మంచిగా పాలన చేయాలంటే చంద్రబాబు రావాలట, తెలంగాణలో వచ్చేసారి ఎన్‌డిఎ కూటమి రావాలని కొన్ని పత్రికలు కథనాలు రాస్తున్నాయి… తెలంగాణను ఆగం చేయడానికి కొందరు రెడీగా ఉంటారు. వీరి పట్ల తెలంగాణ యువత అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు తెలంగాణను ఆగం చేసి కుట్రలను పసిగట్టి కాపాడుకోవాలి. ఒక పొరపాటు జరిగితే జీవితకాలం దుఃఖపడాల్సి వస్తది’ అని అన్నారు. తెలంగాణ నుంచి బిఆర్‌ఎస్ ప్రతినిధులను పార్లమెంటుకు పంపిస్తే… కొట్లాడి మన హక్కులు కాపాడుకుందుము కదా అని అన్నారు. మన దగ్గర ఎంపిల బలం ఉంటే, కేంద్రం మీద ఒత్తిడి చేసి రాష్ట్రాన్ని బాగు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ఈ దిశగా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, వంటేరు ప్రతాపరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మంథని మా జీ ఎమ్మెల్యే పుట్ట మధుతో సహా పాదయాత్రలో పాల్గొన్న వందలాది కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News