Tuesday, September 17, 2024

బిఎస్ఈ త్వరలో బంగారం, వెండి ఫ్యూచర్స్ కాంట్రాక్టులను ప్రారంభించొచ్చు

- Advertisement -
- Advertisement -

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ (బిఎస్ఈ)  బంగారం , వెండి ఫ్యూచర్స్ కాంట్రాక్టులను ప్రారంభిస్తే  బులియన్ మార్కెట్-లీడర్ ఎంసిఎక్స్ (MCX)  మార్కెట్ వాటా , వాల్యూమ్‌లపై ప్రభావం పడనున్నది.

ముంబై: ‘ఒక తలుపు మూసుకుంటే  మరొకటి తెరుచుకుంటుంది’ అనేది సామెత. ఎంసిఎక్స్ తలుపు ఇంకా మూతబడలేదు, కానీ బిఎస్ఈ మరో తలుపు తెరిచుకోబోతున్నట్లు కనిపిస్తోంది.  ఆసియాలో అత్యంత పురాతనమైన బిఎస్ఈ బంగారం , వెండి ఫ్యూచర్స్ కాంట్రాక్టులను ప్రారంభించబోతోందని మార్కెట్లో హోరు కొనసాగుతోంది.

దీనిపై సంప్రదించినప్పుడు, బిఎస్ఈ  ప్రతినిధి ఈ విషయంపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. ఈక్విటీ డెరివేటివ్స్ పై సెబీ వర్కింగ్ కమిటీ,  ఆప్షన్స్ ట్రేడింగ్‌లో ఔత్సాహికుల భాగస్వామ్యాన్ని అరికట్టడానికి చర్యలను ప్రతిపాదించినందున బంగారం,  వెండిలోకి ప్రవేశించడం లాజికల్‌గా కనిపిస్తోందని మార్కెట్ నిపుణులు అంటున్నారు.

ప్రతిపాదనలలో ప్రతి ఎక్స్ఛేంజ్‌కి ఒక వీక్లీ ఆప్షన్ కాంట్రాక్ట్ ,  కనీస కాంట్రాక్ట్ విలువలో నాలుగు నుండి ఆరు రెట్లు పెంపు ఉంటుంది. కొత్త నిబంధనలు అమలైతే, మార్కెట్ వాటాలో స్థిరమైన పెరుగుదలను చూస్తున్న  బిఎస్ఈ డెరివేటివ్స్ సెగ్మెంట్‌ దెబ్బతినగలదని భావిస్తున్నారు. బిఎస్ఈ వెండి , బంగారు కాంట్రాక్టులను ప్రారంభించినట్లయితే, MCX వినియోగదారులను నిలుపుకోవడానికి అనేక ఆప్షన్లను కలిగి ఉంటుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News