Friday, September 20, 2024

బిఎస్‌ఎన్‌ఎల్ నుంచి అదిరిపోయే ఆఫర్ రూ. 91తో రీచార్జ్

- Advertisement -
- Advertisement -

ప్రైవేట్ రంగ టెలికమ్ సంస్థలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ఇటీవల రీచార్జ్ ప్లాన్ల రేట్లను గణనీయంగా హెచ్చించాయి. అయితే, ప్రైవేట్ సంస్థలు ఒక పక్క టారిఫ్ రేట్లను పెంచుతున్నప్పటికీ, ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్‌ఎన్‌ఎల్) మాత్రం చౌక రీచార్జ్ ప్లాన్లను ఇంకా కొనసాగిస్తూనే ఉంది. సంస్థ పాత ధరలకే కస్టమర్లకు ఆఫర్లు అందిస్తోంది. ప్రైవేట్ టెలికమ్ సంస్థలు రీచార్జ్ రేట్టు హెచ్చించిన నేపథ్యంలో చాలా మంది వినియోగదారులు బిఎస్‌ఎన్‌ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు. సంస్థ అందిస్తున్న ప్లాన్లను వారు అన్వేషిస్తున్నారు. కాగా, కస్టమర్లను ఆకర్షించేందుకు బిఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్లు చాలానే ఉన్నాయి. అన్ని విభాగాల్లోను బ్రహ్మాండమైన ఆఫర్లను సంస్థ అందిస్తోంది. రూ. 100 కంటే చౌక అయిన రీచార్జ్‌లు కూడా చాలానే ఉన్నాయి.

బిఎస్‌ఎన్‌ఎల్ అందిస్తున్న ఆకర్షణీయ ఆఫర్లలో రూ. 91 ప్లాన్ ఒకటిగా ఉంది. ఈ ప్లాన్ కింద వినియోగదారులకు 90 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంత తక్కువ ధరలో ఇతర సంస్థలు ఏవీ ఈ స్థాయిలో వ్యాలిడిటీని అందించడం లేదు. తక్కువ ఖర్చుతో సిమ్‌ను ఎక్కువ కాలం యాక్టివ్‌గా ఉంచాలనుకునేవారికి ఈ ప్లాన్ చక్కగా ఉపయోగపడుతుంది. అయితే, ఈ ప్లాన్ కింద కాలింగ్‌కు ఒక నిమిషానికి 15 పైసలు చార్జీ పడుతుంది. ఒక ఎంబి డేటాకు రూ. 1 పైగా, ఒక ఎస్‌ఎంఎస్‌కు 25 పైసలు చెల్లించవలసి ఉంటుంది. టాక్ టైమ్ వోచర్ లేదా డేటా వోచర్‌లతో ప్రత్యేకంగా రీచార్జ్ చేసుకోవలసి ఉంటుంది. తక్కువ ధరల్లో ఈ కూపన్లు అందుబాటులో ఉంటాయి.

రూ. 107తో మరో ఆకర్షణీయ ఆఫర్
బిఎస్‌ఎన్‌ఎల్ అందిస్తున్న ఆకర్షణీయ ఆఫర్లలో రూ. 107 ఒకటి. పరిమితమైన డేటా అవసరమైనవారికి ఈ ప్లాన్ బాగుంటుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 35 రోజులుగా ఉంది. యూజర్లు 200 కాలింగ్ నిమిషాలు పొందుతారు. ఇక పరిమితంగా 35 రోజుల వ్యాలిడిటీతో 3జిబి పరిమిత డేటా లభిస్తుంది. తక్కువ డేటా అవసరమైనవారికి మాత్రమే ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News