Sunday, February 23, 2025

ఉరి వేసుకుని బిటెక్ విద్యార్థి ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

మేడ్చల్: ఉరి వేసుకుని ఓ బిటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలోని కీసర మండలంలో చోటుచేసుకుంది. చీర్యాల గీతాంజలి ఇంజనీరింగ్ కళాశాలలో సిఎస్ఇ 3వ సంవత్సరం చదువుతున్న కరీంగూడ గ్రామానికి చెందిన నల్లరాళ్ల ఆకాష్ రెడ్డి(20) అనే విద్యార్థి.. తన చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఉరివేసుకుని బలవర్మరణానికి పాల్పడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం దవాఖానాకు తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News