Tuesday, September 17, 2024

అనుమానాస్పద స్థితిలో బీటెక్ స్టూడెంట్ మృతి

- Advertisement -
- Advertisement -

అనుమానాస్పద స్థితిలో బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఉప్పల్ హెచ్‌ఎండిఏ లేఅవుట్ లో బంధువుల ఇంట్లో నివసిస్తున్న మిర్యాలగూడకు చెందిన దినేష్ (20) ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని, బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News