Friday, September 20, 2024

రేపు రాష్ట్రమంతటా కెటిఆర్ దిష్టిబొమ్మల దగ్ధం

- Advertisement -
- Advertisement -

మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పట్ల అనుచితంగా మాట్లా డారు. మహిళలను కించపరుస్తూ బస్‌లలో బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్స్‌లు చేయండంటూ అత్యంత ఆవహేళనగా మాట్లాడారు. తెలంగాణ మహిళల పట్ల ఇంత అవమాన కరంగా మాట్లాడి వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన కెటిఆర్ వైఖరిని నిరసిస్తూ శుక్రవారం అన్ని మండల, నియోజక వర్గ, జిల్లా కేంద్రాలలో దిష్టి బొమ్మల దగ్ధం, నిరసన కార్యక్రమాలు చేయాలని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ (ఇంఛార్జి ఆర్గనైజేషన్), ఎంఎల్‌సి మహేష్ కుమార్ గౌడ్ పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమాలలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కెటిఆర్ పై చర్యలు తీసుకో వాలని ఆయన మహిళ లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News