Wednesday, March 26, 2025

లోయలో పడిన బస్సు: 23 మంది మృతి

- Advertisement -
- Advertisement -

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రం అల్మోరా జిల్లా మర్చులా వద్ద సోమవారం ఉదయం బస్సు లోయలో పడింది. రామ్ నగర్ లోని కుపి శివారులో బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో 23 మంది దుర్మరణం చెందగా 17 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. రెస్య్కూ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆస్పతికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 40 యాత్రికులతో బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News